కరోనా వైరస్ విజృంభిస్తున్న దరిమిలా 2020-21 విద్యా సంవత్సరంలో బోర్డు 9 నుంచి 12 తరగతుల వరకు 30 శాతం వరకు తొలగించిన సిలబస్ ను 2021-22లో పునరుద్ధరిస్తున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. అయితే ఇప్పుడు మే, జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనుంది. కొత్త విద్యాసంవత్సరానికి ప్రకటించిన బోధన ప్రణాళిక ప్రకారం సిలబస్ తగ్గింపు ఏమీ ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.