నేడు కూడా దేశీయ మార్కెట్లు అదే లాభాల జోరులో మొదలయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 59,466 వద్ద ట్రేడవుతుండగా, ఇక నిఫ్టీ అయితే 81 పాయింట్లు లాభపడి 17,707 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, పవర్గ్రిడ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, మారుతీ , ఐటీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ , టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.