దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ ఉదయం 57,778.01 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమై 56,777.04 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 949.32 పాయింట్ల నష్టంతో 56,747.14 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 284.45 పాయింట్లు తగ్గి 16,912.25 దగ్గర స్థిరపడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు నష్టపోతాయి.