దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను మొదలు పెట్టాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.