జమ్మూ కశ్మీర్లో వేర్వేరు చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్ షా ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
మొదటి ఎన్ కౌంటర్ గురువారం రాత్రి షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు ముష్కరులు హతం కాగా నలుగురు సైనికులు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
రెండవ ఎన్ కౌంటర్ శుక్రవారం ఉదయం పుల్వామా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదులకు మధ్య జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.