పత్రికా ప్రకటన తిరుపతి, 2020 నవంబరు 12
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం 3 గొడుగులు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్.గోపాల్జి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్కుమార్కు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.