గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం భారతీయ వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం కుప్పకూలిన ఘటనలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మృతి చెందారు. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదాల్లో భారత్ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా కోల్పోవడం బాధాకరం. దీనిపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ప్రారంభించింది. గత 18 నెలల్లో మిగ్-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే ఎయిర్ బేస్లో మిగ్21 ప్రమాదానికి గురైంది.