ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,670 నమూనాలు పరీక్షిస్తే 103 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 175 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,358 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో ఒమిక్రాన్ కేసు కూడా నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు సమాచారం.
జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :
