తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షలు 68,171 కాగా 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. నిన్న కొవిడ్తో ముగ్గురు మృతిచెందడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1674కి చేరింది. నిన్న కరోనా బారి నుంచి 216 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,151 ఉండగా, 1,285 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.