నిజామాబాద్ జిల్లా సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న నాగేశ్వర్రావు కుటుంబం సంగారెడ్డిలోని శ్రీనివాస్నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆయన తరచూ ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఇంట్లో ఉన్న రెండు గదుల్లో ఒక గదికి తాళం వేసి మరో గదిలో కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి గదికి వేసిన తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారం, రూ.60వేల నగదును అపహరించారు. ఉదయం నిద్రలేచి చోరీ విషయం గుర్తించి కుటుంబీకులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలాజీ, పట్టణ సీఐ, ఎస్సైలు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. నాగేశ్వర్రావు గతంలో సంగారెడ్డి పట్టణ సీఐగా చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ రమేశ్ వివరించారు.