ఈజిప్ట్లో దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో నాలుగు బోగీలు బోల్తా పడటంతో 32మంది మృత్యువాతపడగా, మరో 66మందికి గాయాలైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి 36 అంబులెన్స్లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఖలీద్ మెజాహెద్ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.